News June 19, 2024
మాజీ CM జగన్పై ఎస్పీకి ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి జగన్పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్కి వినతిపత్రం అందజేశారు.
Similar News
News February 26, 2026
తెనాలిలో రేపు ఆయేషా మీరా అంత్యక్రియలు

ఆయేషా మీరా అస్థికలను సీబీఐ ఆమె తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు నడుమ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలన్నీ విఫలమయ్యాయని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, డిసెంబర్ 27ను ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
News February 26, 2026
గుంటూరు: డ్రంక్ & డ్రైవ్లో ఒకరికి జైలు శిక్ష

గుంటూరు ట్రాఫిక్ విభాగం నగరంలో ముమ్మరంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 10 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి రూ.7,000ల చొప్పున, ఆరుగురికి రూ.5,000ల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం రూ.51,000 జరిమానా వసూలైందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.
News February 26, 2026
గుంటూరు: డ్రంక్ & డ్రైవ్లో ఒకరికి జైలు శిక్ష

గుంటూరు ట్రాఫిక్ విభాగం నగరంలో ముమ్మరంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 10 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి రూ.7,000ల చొప్పున, ఆరుగురికి రూ.5,000ల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం రూ.51,000 జరిమానా వసూలైందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.


