News April 27, 2024

మాజీ MLA ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ

image

చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లుబాటు విషయం సందిగ్ధంగా మారింది. ఆమంచికి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు, క్రిస్టల్ సీఫుడ్స్ ఫ్యాక్టరీకి విద్యుత్ బకాయిలు ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్వో సూర్యనారాయణరెడ్డి ఆమంచి నామినేషన్ పెండింగ్లో ఉంచారు. శనివారం ఉదయం 10లోపు వాటిని సబ్మిట్ చేయాలని సూచించారు. దీంతో ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News April 23, 2025

నేడు ప్రకాశం జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడంతో వారి మృతదేహానికి నివాళి అర్పించడానికి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రానున్నారు. అంతిమయాత్రలో సీఎం పాల్గొంటారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

News April 23, 2025

చంద్రబాబే లిక్కర్‌ స్కాం చేశారు: తాటిపర్తి

image

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్‌ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్‌ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.

News April 23, 2025

ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

image

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

error: Content is protected !!