News February 2, 2025
మాడుగుల: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి
మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో అతిగా మద్యం తాగిన జి.మోహన్రావు (48) మృతి చెందాడు. మూడు రోజుల కిందటి నుంచి మోహన్ రావు ఎవరికీ కనిపించలేదు. ఇంట్లో ఉంటాడని భావించిన బంధువులు శనివారం డోర్ తీయగా మృతి చెంది కనిపించాడు. మాడుగుల పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. మోహన్ రావు భార్య, కుమార్తె వద్దకు వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 2, 2025
అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు: KTR
TG: ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను KCR తన పదేళ్ల పాలనతో దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని KTR అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను Xలో పోస్ట్ చేశారు. ‘ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చుక్కాపూర్లో 11.9℃, చందనవల్లి, రెడ్డిపల్లె 12, ఎలిమినేడు 12.9, రాచలూరు, మీర్ఖాన్పేట 13, మంగళపల్లె 13.2, వైట్గోల్డ్ SS 13.3, రాజేంద్రనగర్ 13.4, దండుమైలారం, విమానాశ్రయం, అమీర్పేట, మద్గుల్ 13.5, తొమ్మిదిరేకుల 13.7, సంగం, కాసులాబాద్, హైదరాబాద్ యూనివర్సిటీ, వెల్జాల 13.8, కేతిరెడ్డిపల్లి 14, తాళ్లపల్లి 14.1, కొత్తూరులో 14.3℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News February 2, 2025
SKLM: సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.