News December 11, 2025
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో కాన్పు, తదనంతర మాతృ మరణాలను నిరోధించాలని కలెక్టర్ కృతికా శుక్లా వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, గర్భిణుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించి, క్షేత్రస్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News December 12, 2025
ప్రకాశం: ఈనెల 13, 14న టీచర్లకు క్రీడలు.!

ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఈనెల 13, 14న ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్, మార్కాపురంలోని హైస్కూల్, కనిగిరిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో క్రీడలు జరుగుతాయన్నారు.
News December 12, 2025
NZB: ఈ నెల 27వ తేదీలోగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడువు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జీజీ కళాశాల అధ్యయన కేంద్రంలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ,1, 3, 5వ సెమిస్టర్& ఎంబీఏ, బీఎల్ఎస్సీ 2వ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 27తేదీలోగా పరీక్షా ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డా.కె.రంజిత తెలిపారు. ప్రాక్టికల్స్ ఉండే విద్యార్థులు సంబంధిత ఫీజును చెల్లించాలన్నారు. అదనపు సమాచారం కోసం 7382929612ను సంప్రదించాలన్నారు.
News December 12, 2025
భద్రాచలం సర్పంచ్గా పూనం కృష్ణ దొర విజయం

భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూనం కృష్ణ దొర ఘన విజయం సాధించారు. అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్లో సమీప అభ్యర్థిపై ఆయన 1400 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు. కృష్ణ దొర విజయంపై అటవీ కార్పొరేషన్ ఛైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు ప్రజల పక్షాన పోరాడేందుకు మరింత శక్తినిచ్చిందని కృష్ణ దొర పేర్కొన్నారు.


