News March 21, 2025
మాదకద్రవ్యాలు అరికట్టేందుకు సిద్ధం: సీపీ

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్పై పోలీస్ సిబ్బంది అధికారులకు సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు.
Similar News
News February 28, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,900 ఎగబాకి రూ.1,51,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 28, 2026
WGL: స్పీడు పెంచిన గులాబీ దళం!

గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు BRS స్పీడు పెంచింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలను విశ్లేషించిన పార్టీ, గ్రేటర్ను వదలుకొవద్దనే ఉద్దేశంతో ముందు మేల్కొంది. ఇప్పటికే 3 రౌండ్లు వేసిన ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, తాజాగా ఈరోజు కాజీపేటలో పర్యటించి మరోసారి తన హడావుడిని ప్రదర్శంచే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్లోని 66 డివిజన్లలో 40 డివిజన్లను కైవసం చేసుకోవాలనే ప్లాన్తో BRS సమస్యలపై స్పీడ్ పెంచింది.
News February 28, 2026
ASF: ఎక్సైజ్ ఎస్టీఎఫ్లో లీకుల కలకలం

మద్యం అక్రమాలను అరికట్టాల్సిన STF విభాగంలో లీకుల పర్వం కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో MRP కంటే రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ కమిషనర్ దాడులకు ఆదేశించారు. అయితే, అధికారులు వెళ్లేలోపే సమాచారం లీక్ కావడంతో వ్యాపారులు జాగ్రత్త పడ్డారు. కొందరు అధికారులు సిండికేట్తో చేతులు కలిపి దాడుల వివరాలు ముందుగానే చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కమిషనర్ సీరియస్ అయ్యారు.


