News May 6, 2024
మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన
HYD మాదాపూర్లోని శిల్పారామంలో చెన్నై నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య గురువు కలైమామణి రోజా కణ్ణన్.. వారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలతో అలరించారు. కామాక్షి స్వరజతి, శోభిల్లు, సప్తస్వర, ఆనంద నర్తన ప్రకాశం, నను పాలింప, మాయామా, ఎందరో మహానుభావులు, మంగళం తదితర అంశాలను.. రోజా కణ్ణన్, రేవత్, అనంత కృష్ణన్, సహన, సెల్వగణేశ్, విజయరాఘవన్ మొదలైన వారు ప్రదర్శించి అలరించారు.
Similar News
News October 2, 2024
HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!
HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT
News October 2, 2024
HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.
News October 2, 2024
HYD: బాపుఘాట్లో గవర్నర్ నివాళులు
సత్యం, అహింస, ప్రేమ, స్వచ్ఛత అనే విలువలకు కట్టుబడి ప్రజలు మహాత్మా గాంధీ కలలు కన్న భారతం సాకారం చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్హౌస్లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులర్పించారు.