News February 25, 2026

మాదారం చెరువులో వ్యక్తి గల్లంతు

image

ఊర్కొండ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మాదారం చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాచాలపల్లి గ్రామానికి చెందిన బూర వెంకటయ్య (42) అనే వ్యక్తి బుధవారం మాదారం చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఆయన చెరువులో పడి గల్లంతైనట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 26, 2026

SVU: ప్రొఫెసర్‌కు ప్రఖ్యాత అవార్డు

image

SVU వైరాలజీ విభాగ ఆచార్యులు, డీన్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ జి. నరసింహకు న్యూఢిల్లీలోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (NESA) అవార్డు–2025ను ప్రదానం చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. NESA ఫెలోషిప్ అవార్డు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధన, ఆవిష్కరణ శాస్త్రీయ విభాగాలలో పురోగతికి చేసిన అత్యుత్తమ కృషికి ఇస్తారు. నరసింహ ఆధునిక వైద్యంలో నానోటెక్నాలజీ అనువర్తనాలు చేశారు.

News February 26, 2026

ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

News February 26, 2026

గాలివీడులో హత్య కేసు.. ఐదుగురు అరెస్ట్

image

గాలివీడు మండలంలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిందితులు అంగీకరించారు. రూ.4 లక్షల నగదు (మొదటి ముద్దాయి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన సుపారీ), 7 సెల్ ఫోన్లు, 2 కత్తులు, ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ కృష్ణమోహన్, CI, SIని ఎస్పీ ధీరజ్ అభినందించారు.