News October 21, 2025

మానకొండూరు: ఎస్సై సంజీవ్‌ త్యాగం స్ఫూర్తిదాయకం..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం మానకొండూరులోని ఎస్సై సంజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుపాకులగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సంజీవ్ నక్సల్‌తో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారని సీపీ గుర్తుచేశారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి నిబద్ధతను, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News October 22, 2025

స్నేహబంధం కోసం సీపీ ఆలం.. HZBలో ఆకస్మిక సందర్శన

image

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తన బ్యాచ్‌మేట్, ఐపీఎస్ అధికారి చింత కుమార్‌ను కలిసేందుకు హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట గ్రామానికి ఆకస్మికంగా వచ్చారు. సెలవుపై స్వగ్రామంలో ఉన్న చింత కుమార్‌తో గౌష్ ఆలం ఆప్యాయంగా సమావేశమై, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత వృత్తి బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సీపీ చేసిన ఈ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.

News October 19, 2025

KNR: దీపావళి.. ఈ నంబర్లు SAVE చేసుకోండి..!

image

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని CP గౌష్ ఆలం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సాయం కోసం వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కంట్రోల్ రూం(PCR) 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ERSS) 112 నంబర్లను సంప్రదించాలన్నారు. సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు.

News October 19, 2025

KNR: ‘పెద్దల సమక్షంలోనే క్రాకర్స్ పేల్చాలి’

image

దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.