News October 15, 2025
మానవత్వం చాటుకున్న ఎంపీ, ఎమ్మెల్యే శ్రావణి

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మానవత్వం చాటుకున్నారు. శింగనమల మండలం నాయనపల్లి క్రాసింగ్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్న వారు ఘటనను చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసిన మృతదేహాన్ని తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
Similar News
News October 15, 2025
నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

నల్గొండలో మైనర్పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
News October 15, 2025
HYD: దొరికారు కాబట్టి దొంగలు.. లేకపోతే!

రోజూ టికెట్ లేకుండా ప్రయాణించడం.. ఆ.. ఎవరు చెక్ చేస్తారులే అనే ధైర్యంతో వారంతా ఇన్ని రోజులూ రైల్లో ప్రయాణాలు చేశారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లతోపాటు ఇతర డివిజన్లలో రైళ్లల్లో తనిఖీలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 16,105 కేసులు నమోదు చేశారు. అంతేకాక రూ.1.08 కోట్లను జరిమానాగా వసూలు చేశారు. SECలో రూ.27.9 లక్షలు, HYDలో రూ.4.6 లక్షలు వసూలు చేశారు.
News October 15, 2025
మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.