News February 17, 2026

మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్

image

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను చూసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళగిరిలో జరిగే మరో కార్యక్రమానికి వెళ్తుండగా ఎయిమ్స్ సమీపంలో బైకులు ఢీకొని ఓ యువతి, వ్యక్తి గాయపడటాన్ని గమనించారు. మంత్రి వెంటనే తన వాహనం నుంచి దిగి క్షతగాత్రులకు సపర్యలు చేసి పరామర్శించారు. అనంతరం అంబులెన్సు‌లో ఎయిమ్స్‌కి పంపించారు.

Similar News

News February 17, 2026

వికారాబాద్‌లో ఈనెల 24న బియ్యం వేలం

image

జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో పట్టుబడిన సుమారు 583 క్వింటాళ్ల రేషన్ ఫిబ్రవరి 24న వేలం నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వికారాబాద్‌లో 68.05 క్వింటాళ్లు, మండల స్టాక్ పాయింట్ పరిగిలో 86.50 క్వింటాళ్లు తాండూరులో 261.20 క్వింటాళ్లు, కొడంగల్‌లో 167.15 క్వింటాళ్లు మొత్తం 582.90 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం వేస్తున్నట్లు చెప్పారు.

News February 17, 2026

పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

image

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్‌స్టాల్
✒మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి  తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT

News February 17, 2026

రేపు మన్యంకొండలో మొక్కుబడి కోడదూడల బహిరంగ వేలం

image

మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన మొక్కుబడి కోడదూడల బహిరంగ వేలం రేపు బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ అలివేలు మంగమ్మ ఆలయం వద్ద నిర్వహించనున్నారు. ఈ వేలంలో రైతులు మాత్రమే పాల్గొనాలని ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. రైతులు పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, రూ.10000 డిపాజిట్ చెల్లించాలన్నారు.