News February 20, 2025

మామడ: మహిళ దారుణ హత్య

image

NZBజిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన మహిళ హత్యకు గురైంది. పోలీసుల ప్రకారం.. మహిళకు భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను జనవరి 21న నిర్మల్ జిల్లా మామడకు రప్పించాడు. దిమ్మదుర్తి, నల్దుర్తి మార్గంలోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నిందితుడిని రిమాండ్‌కి తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

Similar News

News September 13, 2025

కిలో టమాటా రూ.4

image

నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు(D) పత్తికొండ, నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.

News September 13, 2025

అనకాపల్లిలో నేడే మెగా జాబ్ మేళా

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల హాజరవుతారన్నారు. 25 బహుళ జాతి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి 18 నుండి 35 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.

News September 13, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 18 వరకు గడువు పెంచుతూ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇది చివరి అవకాశం అని, అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.