News September 4, 2025

మామిడికుదురు: దివ్యాంగురాలిపై అత్యాచారం

image

మామిడికుదురు మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడని స్థానికులు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు రహస్యంగా గర్భస్రావం చేయించారు. గ్రామ పెద్దలు రాజీ చేసి, బాధితులకు డబ్బు చెల్లించేలా ఒప్పందం కుదిర్చారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.

Similar News

News September 5, 2025

HYD పరువు తీస్తున్నారు.. మీరు మారరా?

image

వినాయకచవితి పండుగ నగర యువతకు ఒక ఎమోషన్. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే వేడుక ఇది. కానీ, కొందరు పరువు తీస్తున్నారు. ఖైరతాబాద్‌‌కు దర్శనానికి వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి 930 మంది పట్టుబడ్డారు. మరికొందరు మద్యం తాగి జులూస్‌లకు వస్తున్నారు. భక్తిపాటలకు బదులు తమకు నచ్చిన పాటలతో చిందులేసిన వీడియోలు SMలో వైరల్ అయ్యాయి. ఇకనైనా వీటికి స్వస్థి పలికి భక్తితో నిమజ్జనం చేద్దాం. దీనిపై మీ కామెంట్?

News September 5, 2025

భైంసా: మోదీ చిత్రపటానికి ఎమ్మెల్యేల పాలాభిషేకం

image

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఇతర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తూ భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

News September 5, 2025

వరద బాధితులకు అక్షయ్ కమార్ రూ.5 కోట్ల సాయం

image

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని ప్రజా సేవగా భావిస్తున్నానని, విరాళం అనుకోనని ఆయన తెలిపారు. కాగా వరద బాధితులకు ఇప్పటికే ప్రీతి జింటా-రూ.33 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దిల్జిత్ దోసాంజ్, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, సోనూ సూద్ తదితరులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు.