News January 1, 2026

మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు అడుగులు.. పెరగనున్న ధరలు!

image

మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్టుకు అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఎయిర్‌పోర్టుకు మార్చిలో ప్రధాని శంకుస్థాపన చేయనుండటంతో భవిష్యత్తు అభివృద్ధి దృష్ట్యా ప్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గజానికి రూ.10-12వేల వరకు ధర పలుకుతుండగా, శంఖుస్థాపన జరిగితే ధరలు అమాంతం పెరగనున్నాయి.

Similar News

News January 1, 2026

చిత్తూరు కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.

News January 1, 2026

NRPT: ’86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు’

image

డిసెంబర్ 31న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 86 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ గురువారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల వరకు తనిఖీలు చేశారని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 1, 2026

FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

image

ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి FEB 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.