News March 20, 2024
మారుతి ఇస్పాత్ ఫ్యాక్టరీలో ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతి

మంత్రాలయం మండలం మాధవరం సమీపంలోని మారుతి ఇస్పాత్ ఫ్యాక్టరీలో ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ కు చెందిన గంగా(22) ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఇనుప ఖనిజం ముద్ద పడి మృతిచెందినట్లు తెలిపారు. 3 రోజుల క్రితం ఫ్యాక్టరీలో పని చేసేందుకు 13 మంది కూలీలను కాంట్రాక్టర్ తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలో వేస్టేజ్ను తొలగించే క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.
Similar News
News April 2, 2025
రేపు కర్నూలుకు YS జగన్ రాక.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు రానున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11:45కు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో జరిగే కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్రెడ్డి కూతురి వివాహా కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో జగన్ రాకకు జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
News April 2, 2025
కర్నూలు: నేటి నుంచి JEE మెయిన్స్.. ఇవి పాటించాలి.!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు JEE మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా.. పరీక్షను హజరయ్యేవారు కింది విషయాలు తప్పక పాటించాలని అధికారులు తెలిపారు.
➤పరీక్షా కేంద్రానికి 30 నిమూషాల ముందే రావాలి.
➤పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12 వరకు.
➤2వ పేపర్ మధ్యహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు.
➤ఉదయం పరీక్షకు 7గంటలకు, మధ్యహ్నం పరీక్షకు 1గంటకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
News April 2, 2025
కర్నూలు జిల్లాకు వర్ష సూచన

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో, రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది.