News March 20, 2024

మారుతి ఇస్పాత్ ఫ్యాక్టరీలో ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతి

image

మంత్రాలయం మండలం మాధవరం సమీపంలోని మారుతి ఇస్పాత్ ఫ్యాక్టరీలో ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ కు చెందిన గంగా(22) ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఇనుప ఖనిజం ముద్ద పడి మృతిచెందినట్లు తెలిపారు. 3 రోజుల క్రితం ఫ్యాక్టరీలో పని చేసేందుకు 13 మంది కూలీలను కాంట్రాక్టర్ తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలో వేస్టేజ్‌ను తొలగించే క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.

Similar News

News December 30, 2025

పెద్దహరివాణం మండలం పేరు మార్పుపై ఉద్రిక్తత

image

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రతరమైంది. మంగళవారం సిరుగుప్ప, ఆదోని రోడ్డుపై స్థానికులు వందలాదిమంది బైఠాయించి టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.పెద్దహరివాణం మండలంగా గత నెలలో నోటిఫికేషన్ వచ్చిందన్నారు. పెద్దహరివాణంకు బదులుగా ఆదోని మండలంను ఒకటి, రెండుగా విభజించి ప్రకటించడం తగదని ఆగ్రామంలో నాయకుడు ఆదినారాయణ రెడ్డి నిరవధిక దీక్షకు పూనుకున్నారు.

News December 30, 2025

కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

image

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.

News December 30, 2025

కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

image

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.