News February 27, 2025

మారుమూల గ్రామాల్లో అల్లూరి ఎస్పీ పర్యటన

image

పెదబయలు మండలం మారుమూల జామిగూడా పంచాయతీ గుంజివాడ, చింతల వీధి గ్రామాలలో బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, ఏఎస్పీ ధీరాజ్ పర్యటించారు. గుంజివాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న బాపనమ్మ బాలలింగేశ్వర దేవత జాతర సందర్భంగా దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో గల తారాబు జలపాతాన్ని సందర్శించి సందడి చేశారు.

Similar News

News February 27, 2025

చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో

image

AP: మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్‌కు చేనేత వస్త్రాన్ని బహూకరించారు. దానిపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో ఉండటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబసభ్యుల చిత్రాలతో వారు నేసిన చేనేత వస్త్రాన్ని బహూకరించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే వీళ్లు నియోజకవర్గంలో చేస్తున్న సామాజిక సేవకు సాయం అందిస్తాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

News February 27, 2025

సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరి స్పాట్ డెడ్

image

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని పెద్దనపల్లి క్రాస్‌లో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాకలి ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడి తమ్ముడికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పెద్దనపల్లి గ్రామంలోని అతని తండ్రి నాగరాజుతో పాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.

News February 27, 2025

ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

error: Content is protected !!