News April 1, 2025
మారేడుమిల్లి: తమ్ముడు హత్య కేసులో అన్న అరెస్ట్

అల్లూరి జిల్లా మారేడుమిల్లి (M) నీలవరంలో రూ.20 వేలు బాకీ ఇవ్వనందుకు తమ్ముడు సుగ్గిరెడ్డిని బాణంతో హత్య చేసిన అన్న లచ్చిరెడ్డిని అరెస్ట్ చేశామని సీఐ గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గత నెల 23న ఈ ఘటన జరగగా అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా నేడు అరెస్ట్ చేశామన్నారు. వ్యాన్ కొనుగోలు విషయంలో తమ్ముడు అన్నకు 20 ఏళ్ల క్రితం రూ.20వేలు బాకీ పడ్డాడని, అప్పటి నుంచి ఇరువురు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.
Similar News
News April 2, 2025
CMను కలిసిన నాగబాబు

AP: వెలగపూడి సచివాలయంలో CM చంద్రబాబును జనసేన MLC నాగబాబు భార్యతో సహా కలిశారు. MLCగా ప్రమాణ స్వీకారం అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువా కప్పి సీఎం సత్కరించారు. సీఎం, డిప్యూటీ సీఎం తనకు అవకాశం కల్పించి, అప్పజెప్పిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News April 2, 2025
KMR: కలెక్టరేట్లో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి

కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజ స్థాపన చేసిన మహనీయుడని కొనియాడారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
News April 2, 2025
విజయనగరం: ‘ఉద్యాన పంటల సాగు పెంచేందుకు కార్యాచరణ’

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత జిల్లా పరిస్థితులను బట్టి వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఉద్యానసాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం తమ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.