News August 10, 2024
మార్కాపురంలో మూడు రంగుల అరుదైన పక్షి

మార్కాపురం పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలోని చెట్టుపై శుక్రవారం మునియా పక్షి దర్శనమిచ్చింది. మూడు రంగులలో పక్షి ఉండటంతో దీనిని త్రివర్ణ మునియా అంటారని అటవీశాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు. కనిపించకుండా పోతున్న జాతుల్లో త్రివర్ణ మునియా జాతి ఒకటని అన్నారు. కళాశాల ప్రాంగణంలో చెట్లపై ఈ పక్షిని గమనించిన విద్యార్థులు వింతగా చూశారు.
Similar News
News November 11, 2025
ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఉండవల్లికి బయలుదేరారు.
News November 11, 2025
త్వరలో కనిగిరి కనకపట్నం అవుతుంది: సీఎం చంద్రబాబు

1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి కనకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు.
News November 11, 2025
ప్రకాశం: పెద్ద చెర్లోపల్లికి చేరుకున్న సీఎం

ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం ఇర్లపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్ఛార్జులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకున్నారు.


