News April 28, 2024
మార్కాపురం: కందులపై కేసు నమోదు

మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ శనివారం తెలిపారు. ఈనెల 25వ తేదీన నామినేషన్ సందర్భంగా కళాశాల రోడ్డులోని ఓ టీడీపీ నేత వెంచర్ లో అనుమతి లేకుండా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ అంశాలపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News October 26, 2025
CMతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రకాశం కలెక్టర్

ప్రకాశం కలెక్టర్ రాజబాబు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీఎం వివరించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను కలెక్టర్ వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
News October 26, 2025
సముద్ర స్నానాలకు రావద్దు: ఒంగోలు DSP

మెంథా తుఫాను నేపథ్యంలో ఒంగోలు DSP శ్రీనివాసరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల, పాకల, ఊళ్ళపాలెం, కనపర్తి బీచ్లకు సముద్ర స్నానాలకు ప్రజలు ఎవరూ రావద్దని కోరారు. తుఫాన్ నేపథ్యంలో సముద్రం అల్లకలోలంగా ఉందని హెచ్చరించారు. ప్రజలకు ఏదన్నా అవసరం ఉంటే తమను సంప్రదించాలని కోరారు.
News October 26, 2025
అక్రమాలకు పాల్పడినందుకే సస్పెండ్: ప్రకాశం కలెక్టర్

ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడినందుకే కనిగిరి MROను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, త్వరలోనే పరిష్కార చర్యలు పూర్తిస్థాయిలో ఉంటాయని కలెక్టర్ అన్నారు.


