News July 2, 2024

మార్కాపురం: భార్యను చంపిన భర్తకు జైలు శిక్ష

image

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మార్కాపురంలోని శరభయ్య మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019లో భార్య పార్వతి నిద్రిస్తుండగా గొడ్డలి వెనుక భాగంతో తలపై కొట్టడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు.

Similar News

News July 5, 2024

పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట

image

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 5, 2024

ప్రకాశం: పెంపుడు కుక్కలు ఉంటే ఇలా చేయండి

image

రేబిస్ వ్యాధినుంచి నివారణకు పెంపుడు కుక్కల యజమానులు తప్పనిసరిగా తమ కుక్కలకు రాబిస్ వాక్సిన్ చేయించుకోవాలని జిల్లాపశు సంవర్ధక శాఖ అధికారి బేబిరాణి అన్నారు. జునోసిస్ డే సందర్భంగా స్థానిక సంతపేట పశువైద్యశాలలో 6వ తేదీన అన్ని పెంపుడు కుక్కలకు ఈ రేబిస్ టీకాను ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం వరకు ఉచితంగా అందజేస్తామని అన్నారు. కావున ఈ అవకాశాన్ని జిల్లాలోని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

News July 5, 2024

మార్కాపురం: వ్యాపారి కిడ్నాప్.. వదిలేసిన రైతులు

image

మార్కాపురం మండలం బిరుదులనరవకు చెందిన వ్యాపారి వెంకట్ రెడ్డి గొట్టిపడియకు చెందిన రైతులనుంచి మిరపకాయ డబ్బులు రూ.1.30 కోట్లు ఎగ్గొట్టడంతో <<13561112>>బుధవారం రైతులు<<>> అతనిని కిడ్నాప్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు గ్రామ శివారులో రైతులు అతనిని విడిచిపెట్టారు. అప్పు ఎవరు తీరుస్తారని రైతులు పోలీసులు వద్ద వాపోయారు.