News March 23, 2024

మార్కాపురం: 7 మంది వాలంటీర్లు రాజీనామా

image

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందచేశారు.

Similar News

News July 3, 2024

జాతీయ స్థాయికి ఎంపికైన ఒంగోలు విద్యార్థినులు

image

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఒంగోలులోని ఓ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల పర్యవేక్షణ అధికారి వసుంధర దేవి పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న అభిలాష, నాలుగో తరగతి చదువుతున్న గీతాంజలి జూన్ 20న విజయవాడలో జరిగిన అండర్-13 విభాగంలో రాణించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.

News July 3, 2024

ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

News July 3, 2024

శానంపూడి ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్య

image

శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్‌ సెంటర్‌లో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న రమావంత్‌ రవినాయక్‌ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.