News April 1, 2026

మార్కెట్లో బుల్ జోరు!

image

పశ్చిమాసియా యుద్ధ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధర తగ్గడంతో ఇవాళ బుల్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,900 పాయింట్లు ఎగసి 73,835 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 570 పాయింట్లు లాభపడి 22,910 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Similar News

News April 12, 2026

2 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు బ్యాన్!

image

2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాయకుండా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఐదేళ్ల పిల్లలకూ వాటి వాడకాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ రిలీజ్ చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దగ్గు మందు వల్ల పిల్లలు <<17944156>>చనిపోవడం<<>>, సిరప్‌లో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడం తెలిసిందే.

News April 12, 2026

చైనాకు ట్రంప్ వార్నింగ్

image

ఇరాన్‌కు చైనా ఆయుధాలు పంపే అవకాశం ఉందన్న అమెరికా <<19628773>>నిఘా వర్గాల<<>> హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. చైనా అలా చేస్తే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌తో చర్చల్లో విజయం తమదేనని అన్నారు. ‘చర్చల్లో ఒప్పందం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అదంతా పట్టించుకోను. గెలిచేది మనమే. నౌకలు మన దేశం వైపు బయల్దేరుతున్నాయి. భారీ ట్యాంకర్లలో చమురు, గ్యాస్ నింపుతున్నాం’ అని చెప్పారు.

News April 12, 2026

రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు!

image

TG: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. దుబాయ్‌లో డ్రగ్స్ పార్టీల్లో ఆయన పాల్గొన్నారని, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారని కనిపెట్టినట్లు సమాచారం. కస్టడీలో కీలక విషయాలను అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ఆయన అరెస్టు కావడం తెలిసిందే.