News March 2, 2026
మార్కెట్ల బ్లడ్బాత్.. రూ.8లక్షల కోట్లు ఆవిరి

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1498, నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపడుతుండటంతో రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు 6శాతం, ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 5శాతం కోల్పోయాయి. డిఫెన్స్ షేర్లు పుంజుకున్నాయి.
Similar News
News April 5, 2026
ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద ‘క్యాష్’ బంద్: కొత్త రూల్స్ ఇవే!

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి. UPIతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు పని చేయకపోతే వాహనదారుడికి ‘ఈ-నోటీస్’ వస్తుంది. 72 గంటల్లోపు ఆన్లైన్లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఆ తర్వాత అయితే డబుల్ టోల్ కట్టాలి. 15 రోజులు దాటితే VAHAN సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవు.
News April 5, 2026
కరెంట్ అఫైర్స్ (05-04-2026)

⋆ బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత ఆర్చర్ పాయల్ నాగ్కు గోల్డ్ మెడల్
⋆ ఆరో తరగతి నుంచి 3 భాషల విధానం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు: CBSE
⋆ నాసా ఆర్టెమిస్-2 ప్రయోగం.. 1972 తర్వాత తొలిసారిగా చంద్రుడి కక్ష్యలోకి మనుషులు
⋆ ప్రపంచంలో అత్యంత బరువైన (7 టన్నులు) కార్గో డ్రోన్(Changying-8 లేదా CY-8)ను పరీక్షించిన చైనా.. దీని రేంజ్ 1,850మైళ్లు (2,977kms)
News April 5, 2026
న్యూక్లియర్ ముప్పు.. ఐరాసకు ఇరాన్ లెటర్

ఇరాన్లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం ‘బుషెహర్’ సమీపంలో జరుగుతున్న వరుస దాడులపై ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఐరాసకు లేఖ రాశారు. ఈ అటాక్స్ వల్ల రేడియోధార్మికత వెలువడే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల కేవలం ఇరాన్కే కాకుండా పొరుగు దేశాలకూ తీరని నష్టం కలుగుతుందని హెచ్చరించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. తాజాగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఈ కేంద్రంపై నాలుగోసారి దాడి చేశాయి.


