News March 1, 2025

మార్చి 14న సింహాచలంలో డోలోత్సవం

image

మార్చి 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ సిబ్బంది శనివారం తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారు ఉత్సవ విగ్రహాలను కొండమీద నుంచి మెట్లు మార్గంలో ఊరేగింపుగా కొండ కింద ఉన్న ఉద్యానవనానికి తీసుకురానున్నట్లు తెలిపారు. మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం నిర్వహించి తిరువీధి ఊరేగింపు చేయనున్నట్లు తెలిపారు. ఆరోజున ఉండే కళ్యాణం రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News July 4, 2025

విశాఖ జిల్లాలో 636 పాఠశాల్లో వైద్య పరీక్షలు

image

DMHO జగదీశ్వరరావు ఆదేశాల మేరకు విశాఖలో పాఠశాల విద్యార్థులకు జూలై 3నుంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పలు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎమ్‌లు ఆరోగ్య పరీక్షలు చేశారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే శారీరక ,మానసిక లోపాలను గుర్తించి సరైన వైద్యసేవలను ఇవ్వనున్నారు. జిల్లాలో 636 పాఠశాలల్లో 96,159 మంది, 914 అంగన్వాడీలలో 56,371 మందికి పరీక్షలు చేస్తారు.

News July 4, 2025

విశాఖ జిల్లా టీచర్లకు గమనిక

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు 2025‌కు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, వివరాలకు వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని తెలిపారు.

News July 4, 2025

బ్యాంకర్లకు విశాఖ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

సామాన్యుల ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా బ్యాంకర్లు స‌హ‌కారం అందించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులతో క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో శుక్ర‌వారం సమావేశమయ్యారు. స్వ‌యం స‌హాయ సంఘాల స‌భ్యుల‌కు అందించే రుణాల‌ను స‌కాలంలో రెన్యువ‌ల్ చేయాల‌ని, వారి పొదుపు ఖాతాలోని 50శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్.డి. చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.