News March 23, 2024
మార్చి 25న కోటప్పకొండ గిరి ప్రదక్షిణ
మార్చి 25 తేది సోమవారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవాసమితి అధ్యక్షులు అనుమోలు వెంకటచౌదరి మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వద్ద విజయ గణపతి దేవాలయం వద్ద అల్పాహారం, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 6, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో రూ.84.97కోట్లు
పీఎం కిసాన్ పథకం కింద ఉమ్మడి గుంటూరు జిల్లాకు రూ.84.97కోట్లు వచ్చాయి. ఈ మేరకు సదరు నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ పథకం కింద గుంటూరు జిల్లాలోని 86,674 మంది రైతులకు రూ.17.33కోట్లు, పల్నాడు జిల్లాలో1,97,639 మంది రైతులకు రూ.39.53కోట్లు, బాపట్ల జిల్లాలో1,40,559 మంది రైతులకు రూ.28.11కోట్లు చొప్పున కేంద్రం జమ చేసింది.
News October 6, 2024
గుంటూరు: కానిస్టేబుల్ అని బెదిరించి లైంగిక దాడి
పోలీసు కానిస్టేబుల్ అని ఓ విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట CI వీరయ్య వివరాల మేరకు.. ఇద్దరూ ప్రేమికులు బస్టాండ్కు వెళ్తుండగా మార్గంమధ్యలో ఓ వ్యక్తి వారిని ఆపాడు. తాను కానిస్టేబుల్ని అని.. ఎక్కడికి వెళ్తున్నారని వారిని బెదిరించి స్టేషన్కు రావాలన్నాడు. అనంతరం ఆ విద్యార్థినిని వాహనంపై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
News October 6, 2024
యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి: అనిత
మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో నూతన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు (రామ)రాజుని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అనిత కోరారు.