News February 4, 2025

మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: అల్లూరి కలెక్టర్  

image

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ MLC, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్ర MLC ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి మార్చి 8 వరకు అల్లూరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దీంతో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో జరుగుతున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మార్చి 8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

image

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.

News November 17, 2025

HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

image

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.

News November 17, 2025

భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

image

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.