News August 18, 2025
‘మార్వాడీ గో బ్యాక్’: ఆమనగల్లు బంద్పై ఉత్కంఠ

ఆమనగల్లు బంద్ చర్చనీయాంశమైంది. మార్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు ‘గో బ్యాక్’ నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అనగా, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్థానిక వ్యాపారుల మద్దతుదారులు తేల్చి చెప్పగా.. బంద్ ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News August 18, 2025
గోల్కొండ కోటను ఏలిన గౌడన్న

సర్వాయి పాపన్న గౌడ్.. గోల్కొండను ఏలిన వీరుడు. జనగామ(D) ఖిలాషాపూర్లో జన్మించాడు. పెద్దలను దోచి పేదలకు పంచిన ఈయన జమీందార్లలో వణుకు పుట్టించాడు. 12 మందితో మొదలైన పాపన్న దళం 12 వేలకు విస్తరించి, చివరకు గోల్కొండలో బహుజన జెండా ఎగరేశాడు. ఇది నచ్చని జమీందార్లు మొగల్ రాజును ఉసిగొల్పి, పాపన్న మీద దాడి చేయించారు. శతృవులు చంపారని కొందరు, పాపన్నే ప్రాణత్యాగం చేశారని మరికొందరు చెబుతారు.
నేడు పాపన్న గౌడ్ జయంతి.
News August 17, 2025
HYD: వినాయకచవితి.. పోలీసుల సూచనలు

వినాయకచవితి నేపథ్యంలో పోలీసులు ఆర్గనైజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్లైన్లో పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. DJల స్థానంలో సంప్రదాయంగా కళాకారులతో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆదివారం మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు.
SHARE IT
News August 17, 2025
HYD: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఓయూ దూరవిద్య కేంద్రంలో ఈ విద్యా సంవత్సరానికి MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 2వ తేదీ వరకు, రూ.500 ఫైన్తో 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాగా సెప్టెంబర్ 7న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. టీజీఐసెట్-2025లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ కోర్సుల్లో నేరుగా ప్రవేశం కల్పించనున్నారు.