News August 18, 2025

‘మార్వాడీ గో బ్యాక్’: ఆమనగల్లు బంద్‌పై ఉత్కంఠ

image

ఆమనగల్లు బంద్‌ చర్చనీయాంశమైంది. మార్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు ‘గో బ్యాక్’ నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అనగా, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్థానిక వ్యాపారుల మద్దతుదారులు తేల్చి చెప్పగా.. బంద్‌ ఉత్కంఠ‌ రేపుతోంది.

Similar News

News August 18, 2025

నిజాంపట్నం పోర్టుకు 3వ ప్రమాద హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం పోర్టుకు సోమవారం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 18, 2025

సాలూరు: తల్లి మరణం తట్టుకోలేక తనయుడి సూసైడ్

image

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాలూరుకు చెందిన తట్టికోట సరస్వతి(80) ఈనెల 8న మరణించారు. ఆమె లేదని మనస్తాపం చెందిన కుమారుడు రామక్రిష్ణ (50) సోమవారం నుంచి కనిపించకపోగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరఘట్టం వద్ద నాగావళి నదిలో శవమై కనిపించాడు. తనకు అండగా ఉండే అమ్మ చనిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

News August 18, 2025

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.