News March 30, 2024

మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం

image

భద్రాచలం: మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం రేపాయి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కన్నాయిగూడెం వద్ద శనివారం నడిరోడ్డుపై మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి. ఈ కరపత్రాల్లో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాంలు, టైగర్ జోన్‌లు, అభయారణ్యాలు వంటి ప్రాజెక్టులను నిలిపి వేయాలని ఆ పత్రాలలో పేర్కొన్నారు.

Similar News

News April 22, 2025

ఖమ్మం జిల్లా ఇంటర్ రిజల్ట్స్

image

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.

News April 22, 2025

ఖమ్మం జిల్లా జైలులో పనికిరాని ఇనుప సామగ్రి వేలం

image

పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్‌ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.

News April 22, 2025

జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

image

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.

error: Content is protected !!