News September 12, 2025
మావోయిస్టు మృతితో మడికొండలో విషాద ఛాయలు..!

హనుమకొండ జిల్లా మడికొండలో మావోయిస్టు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. మడికొండ వాస్తవ్యుడైన కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), సెంట్రల్ రీజినల్ బ్యూరో మెంబర్ (CRBM), ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ(60) అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రాజేష్ అలియాస్ రామచందర్ అలియాస్ రాజేంద్ర మరణించినట్టుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు.
Similar News
News September 12, 2025
VIRAL: ‘మిరాయ్’లో ప్రభాస్ లుక్పై క్లారిటీ!

తేజా సజ్జ ‘మిరాయ్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఈ చిత్రంలో చివర్లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం SMలో జోరుగా సాగింది. చాలా మంది రాముడి లుక్లో ఉన్న ప్రభాస్ ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఇదంతా ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటో అని గ్రోక్తో పాటు సినిమా చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ మాత్రమే ఇచ్చినట్లు క్లారిటీ ఇస్తున్నారు.
News September 12, 2025
పాడేరు: 12 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి

పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో 12 నుంచి పర్యాటకులకు పద్మాపురం గార్డెన్లో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇందులో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.
News September 12, 2025
పెద్దపల్లి: రైల్వే ప్రయాణికులకు తిరుపతి వీక్లీ ట్రైన్

చర్లపల్లి- రక్సాల్ మధ్య రైలు నం.07051/52 రాకపోకలు సాగిస్తుంది. రైలు నం.07051 ఈనెల 20న తిరుపతి నుంచి ప్రారంభమై ప్రతి శనివారం వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, PDPL, మంచిర్యాలలో స్టాప్లలో ఆగుతూ వెళ్లనుంది. రైలు నం.07052 ఈనెల 23న ప్రారంభమై ప్రతి మంగళవారం రక్సాల్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పండగల దృష్ట్యా దీనిని వినియోగించుకోవాలన్నారు.