News January 13, 2026

మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

image

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.

Similar News

News February 17, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

శుభకార్యాల వేళ బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.2,840 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,42,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 17, 2026

KCRకి CM రేవంత్, YS జగన్ బర్త్‌డే విషెస్

image

TG: KCR బర్త్ డే సందర్భంగా పలువురు నేతలు SM వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో KCRకి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని CM రేవంత్ ఆకాంక్షించారు. ‘నా ఫరెవర్ హీరోకి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను ఇన్‌స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు. AP మాజీ సీఎం జగన్, హరీశ్‌రావు తదితరులు విషెస్ తెలియజేశారు.

News February 17, 2026

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్ అయ్యి 83,071 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 25,605 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఎటర్నల్ షేర్లు 1%కుపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, బీఈఎల్, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో కొనసాగుతున్నాయి.