News March 1, 2026
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత.. PM మోదీ కీలక భేటీ

ప్రధాని మోదీ కాసేపట్లో ఢిల్లీలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS)తో మీటింగ్ నిర్వహించనున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్-US యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల రాజస్థాన్, తమిళనాడు పర్యటన అనంతరం PM మోదీ కొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. కాగా CCS దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
Similar News
News March 2, 2026
దలాల్ స్ట్రీట్లో ‘దడ’

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం భారత మార్కెట్లను కుదిపేస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 1700, నిఫ్టీ 560 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, పోర్ట్స్, ఎయిర్వేస్, ఆటో, చమురు రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో రూ.10లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇక గోల్డ్, సిల్వర్ ETFs మాత్రం రయ్యిన దూసుకెళ్తున్నాయి. బిగ్ మనీ మొత్తం విలువైన మెటల్స్ వైపే పరుగులు తీస్తోంది. అనిశ్చితి మరింత పెరిగేలా కనిపిస్తోంది.
News March 2, 2026
GAILలో 70 పోస్టులు.. అప్లై చేశారా?

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com
News March 2, 2026
ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్

AP: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు.


