News September 16, 2025
మిడ్జిల్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో 167 హైవేపై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. చిల్వర్ గ్రామానికి చెందిన రాములు బైక్ వెళ్తూ ఆగి ఉన్న బొలెరోను ఢీన్నాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 29, 2026
MBMR: గుర్తింపు లేని పాఠశాలలలో పిల్లలను చేర్పించరాదు: డీఈవో

మహబూబ్ నగర్ జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం చేత గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్ చేయరాదని డీఈవో ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేముందు గుర్తింపు ఉన్నదా లేదా అని తెలుసుకోవాలన్నారు.
News January 29, 2026
అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలి: MBNR కలెక్టర్

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బుధవారం ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవితో కలిసి కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే ముందు అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జతచేయాలో చెక్ లిస్ట్ స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాలని సూచించారు.
News January 28, 2026
విద్యుత్ కాంతులతో మన్యంకొండ ముస్తాబు

మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.


