News October 30, 2025
మినిస్టర్ అజ్జూ భాయ్.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ముందు ప్లాన్ ప్రకారం పథకం అమలు చేసింది. మంత్రి వర్గంలోకి భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజాహరుద్దీన్ను తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి. కాగా ప్రచారానికి వచ్చిన ఆయన ముఖంలో వెలితి కనిపించింది. ఇక్కడి మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందని పరిశీలకులు భావిస్తున్నారు.
Similar News
News October 30, 2025
కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.
News October 30, 2025
ఆ విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ: అడ్లూరి

TG: ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం కింద ఒక్కో విద్యార్థికి ₹20 లక్షల చొప్పున 2,288 మందికి ₹304 కోట్లు <<18143119>>విడుదల<<>> చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 2022 నుంచి ఇప్పటివరకు ₹463 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర విద్యార్థులకు ఉపశమనం లభిస్తుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు.
News October 30, 2025
తంగళ్లపల్లి: టార్పాలిన్ కవర్లు తప్పనిసరి: కలెక్టర్ ఆదేశం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్ కవర్లు అందజేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం ఆమె తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.


