News December 28, 2025

మిరపలో ఆకు ముడత తెగులు – యాజమాన్యం

image

పొలానికి ఆఖరి దుక్కిలో ఎకరాకు 200కిలోల వేప పిండి, తిరిగి బోదెలు ఎగవేయునపుడు 100 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు మొక్కలు నాటే 15 రోజుల ముందు పొలం చుట్టూ 2-3 వరుసల మొక్కజొన్న లేదా సజ్జ మొక్కలను పెంచాలి. నాటిన తర్వాత ఎకరాకు 10 పసుపు, 10 నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. నారు మొక్కలను నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.5 మి.లీ) మందు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి.

Similar News

News December 28, 2025

‘మన్ కీ బాత్’లో నరసాపురం ప్రస్తావన

image

AP: ‘మన్ కీ బాత్‌’లో PM మోదీ ఏపీలోని నరసాపురం ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలోని సంప్రదాయ కళల అంశంపై మాట్లాడుతూ లేస్(అల్లికలు) గురించి ప్రస్తావించారు. ఈ కళ తరతరాలుగా మహిళల చేతుల్లో ఉందని చెప్పారు. నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ ఉందని తెలిపారు. కాగా సుమారు 500 రకాల ఉత్పత్తుల తయారీలో లక్ష మంది మహిళలు భాగమవుతున్నారు. హ్యాంగింగ్స్, డోర్ కర్టెన్లు, సోఫా కవర్లు, కిడ్స్‌వేర్‌లో ఈ లేస్‌ను వినియోగిస్తారు.

News December 28, 2025

90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

image

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.

News December 28, 2025

మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

image

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్‌లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.