News March 10, 2025
మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. కాగా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News March 10, 2025
మెదక్: పరీక్షకు 5,529 విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ సెకండ్ పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 5,640 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 5,529 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 111 మంది వివిధ కారణాల వల్ల హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
News March 10, 2025
చట్ట పరిధిలో సమస్యల పరిష్కరించాలి: ఎస్పీ

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 89 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ నేరుగా అర్జీలను స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
News March 10, 2025
NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.