News April 5, 2024
మిసెస్ ఇండియా పోటీల్లో ‘గోదారి’ మహిళ సత్తా

మిసెస్ ఇండియా పోటీల్లో ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన రుద్రరాజు ఛాయాదేవి సత్తా చాటారు. గత నెల 30న ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో జరిగిన ఈ పోటీల్లో మిసెస్ ఇండియా(క్లాసిక్)గా ఎంపికయ్యారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గుండుగొలనులోనే సాగగా.. వివాహానంతరం హైదరాబాద్లో స్థిరపడ్డారు. MBA చదివిన ఛాయాదేవి ప్రస్తుతం శ్రీవిహారి సర్వీసెస్ లిమిటెడ్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
Similar News
News March 31, 2025
కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన కొయ్యలగూడెం(M) సీతంపేట వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం(M) లక్కవరం గ్రామానికి చెందిన వీర నాగేశ్వరరావు, భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి రాజమండ్రి వెళ్తున్నారు. సీతంపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో నాగేశ్వరరావు మృతి చెందగా భార్యాపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
News March 31, 2025
కాళ్ల: కోడి పందేలు ఆడుతున్న ముగ్గురు అరెస్ట్

కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు. ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ.6,100 నగదు, కోడిపుంజు, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు.
News March 30, 2025
జైలులో మహిళా ఖైదీ సూసైడ్

ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న శాంతికుమారి అనే మహిళా ఖైదీ బ్యారక్లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.