News September 5, 2025

మిస్సింగ్ కేసుపై పోలీసుల శోధన.. చంపేశారంటూ కథనాలు

image

నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి వెంకట పార్వతీశ్వర గుప్త గత నెల 26న మిస్సింగ్ అయినా కేసును పోలీసులు శోధిస్తున్నారు. వ్యాపారిని హత్య చేశారని సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Similar News

News September 7, 2025

సిక్కోలు నటుడికి SIIMA అవార్డు

image

ఆమదాలవలస(M) కొర్లకోటకి చెందిన నటుడు పేడాడ సందీప్ సూరజ్‌కి దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ హీరో అవార్డును శనివారం ప్రకటించారు. సూరజ్ హీరోగా నటించిన ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాకి గాను అవార్డు లభించింది. దీంతో అతనికి అభిమానులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

News September 7, 2025

నేడు APPSC పరీక్షలు ఆధ్వర్యంలో FBO, ABO పరీక్షలు

image

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO), అసిస్టెంట బీట్ ఆఫీసర్(ABO), ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు పది పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. పరీక్షలకు మొత్తం 5186 మంది హాజరవుతారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.

News September 7, 2025

శ్రీకాకుళం: పరీక్షా కేంద్రాల పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షల ఏర్పాట్లను శనివారం ఏపీపీఎస్సీ సభ్యుడు ఎన్. సోనీ వుడ్ పరిశీలించారు. జిల్లాలోని ముఖ్యమైన మూడు కేంద్రాలతో పాటుగా ఆయా అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.