News January 4, 2026

మీకోసం వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.

Similar News

News January 5, 2026

తిరుపతి: రూ.100కి రూ.40 వడ్డీ.. ప్రశ్నిస్తే హత్యాయత్నం.!

image

ఏర్పేడు మండలంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు హద్దు దాటుతున్నాయి. రూ.100కు రూ.20-40 వరకు వడ్డీ వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నారట. అప్పు తీర్చకపోతే బైకులు, విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుంటున్నారట. పోలీసులను ఆశ్రయిస్తే చంపేస్తామంటున్నారట. దీంతో బాధితులు బయటికి రాలేక అధిక వడ్డీలకు బలవుతున్నట్లు సమాచారం. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?

News January 5, 2026

పిల్లలకు ఈ పోషకాలు అత్యవసరం

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.

News January 5, 2026

KNR: సీతక్కా.. ఎగ్ బిర్యానీ పథకం ఎత్తేశారా?

image

అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా జూన్ 11న ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజులోనే అటకెక్కింది. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు వారానికి 2సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తామని అధికారులు ప్రకటించినా.. ఆచరణలో అమలు కావడం లేదు. దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు లేవంటూ చేతులెత్తేస్తున్నారు. ఉమ్మడి KNRలో 3,135 అంగన్వాడీ కేంద్రాల్లో 1,80,112 చిన్నారులు, 40,160 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు.