News November 4, 2025
మీర్జాగూడ ఘటన.. ఆ గుంత పూడ్చివేత

చేవెళ్ల మండలం మీర్జాగూడలో నిన్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి కారణమైన గుంతను అధికారులు ఈరోజు పూడ్చివేసినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతను తప్పించడానికి టిప్పర్ డ్రైవర్ ప్రయత్నించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముందే రోడ్డుకు మరమ్మతులు చేసి ఉంటే అంత మంది ప్రాణాలు పోయేవి కావంటున్నారు.
Similar News
News November 4, 2025
HYD: ఓయూపై సీఎం ఫోకస్.. ప్రణాళిక రూపకల్పన

సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం అధ్యక్షతన అధికార యంత్రాగం విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. రూ. వెయ్యి కోట్ల నిధులతో ఓయూను ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలతో ఓయూ పాలకవర్గం సమావేశమైంది. పలు విషయాలపై చర్చించారు.
News November 4, 2025
సూర్యాపేట: అంతరాష్ట్ర దొంగ మధు అరెస్ట్

నడిగూడెం మండలం వల్లాపురానికి చెందిన అంతరాష్ట్ర దొంగ కిన్నెర మధు(37)ను HYD నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. OCT 30న HYDలో చేసిన ఓ చోరీ కేసులో అతనితోపాటు APకి చెందిన వ్యక్తి (35) నుంచి రూ.30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, KG వెండి ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. మధు గతంలో 25కుపైగా కేసుల్లో జైలుకెళ్లాడు. 2018లో KDD PS వారు PD చట్టం ప్రయోగించారు. చివరగా 2024లో చర్లపల్లి జైలుకు వెళ్లాడు.
News November 4, 2025
ఇల్లంతకుంట: ‘కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర’

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్న ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి తరలించాలని అధికారులను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు.


