News November 4, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. VKB జిల్లా వాసులే 15 మంది

హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులు అధికులు VKB జిల్లాకు చెందిన వారే. తాండూర్: షేక్ ఖాలీద్ హుస్సేన్, జహాన్, నందిని, సాయిప్రియ, తనూష, వెంకటమ్మ, సెలేహ బేగం, జహీరా ఫాతిమా (పసిపాప), ముస్కాన్ బేగం, యాలాల్: గుర్రాల అఖిలా రెడ్డి, బందెప్ప, లక్ష్మి, దౌల్తాబాద్: హనుమంతు, బషీరాబాద్: దస్తరి బాబా (బస్సు డ్రైవర్) మృతి చెందారు.
Similar News
News November 4, 2025
సీఎంఆర్ డెలివరీలో పెద్దపల్లి రికార్డు

2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ రైస్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీని NOV 8 నాటికి పూర్తిచేయాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. 99.5% డెలివరీతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. మిగిలిన రైస్ను గడువులోగా పంపిణీ చేయాలని, రబీ సీజన్కు కూడా సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
News November 4, 2025
ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండండి: VZM JC

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని JC సేథుమాధవన్ పేర్కొన్నారు. అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కామన్ వెరైటీకి క్వింటాకు రూ.2369, గ్రేడ్-ఏ రూ.2389 మద్దతు ధరగా నిర్ణయించారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, 50 లక్షల గోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
News November 4, 2025
KMR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పదోన్నతి

కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పి.చంద్రశేఖర్కు పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆర్ఎంఓగా ఆయన పదోన్నతి పొందారు. గతంలో దోమకొండ Dy.DMHOగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎల్లారెడ్డి Dy.DMHOగా విధులు నిర్వహిస్తూనే ఇన్ఛార్జి జిల్లా వైద్యాధికారిగా పనిచేశారు.


