News March 11, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News March 12, 2025
ఫ్రీ హోల్డ్ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల PGRS అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని, రెండో విడత రీ సర్వేకు సంబంధించి మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై కలెక్టర్తో సీసీఎల్ఏ & స్పెషల్ సీఎస్ జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.
News March 11, 2025
ATP: అన్ని అంశాల్లో జిల్లా టాప్ – 6లో ఉండాలి- కలెక్టర్

పంచాయతీ సెక్టర్, GSWS తదితర అంశాలలో అనంతపురం జిల్లా టాప్ – 6లో ఉండేందుకు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. MSME సర్వేలో పురోగతి తీసుకొచ్చి 24 గంటల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News March 11, 2025
పోలీసులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ

గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ నిర్వహించారు. జవాబుదారీగా పని చేసి ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచి, కేసులు తగ్గించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాల అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.