News September 21, 2025
మీ కోసం కాల్ సెంటర్ 1100 సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

అనంతపురం జిల్లా ప్రజలు కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ చెప్పారు. కలెక్టరేట్లో మాట్లాడిన ఆయన అర్జీలు సమర్పించిన ప్రజలకు సమస్య పరిష్కారం కాకపోతే 1100 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 21, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అమూల్య ఎంపిక

అనంతపురం జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శన చూపిన గుంతకల్లుకు చెందిన బి.అమూల్య రాష్ట్రస్థాయి అండర్-20 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె.. ఈనెల 27న ఏలూరులో జరిగే పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున పాల్గొననుంది. విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అమూల్యను పలువురు అభినందించారు.
News September 20, 2025
Pharm.D, B.Pharmacy, M.Sc పరీక్షా ఫలితాలు విడుదల

అనంతపురం JNTUలో ఆగస్టులో జరిగిన Pharm.D 2, 5వ సంవత్సరాల సెమిస్టర్ల, B.Pharmacy 2-1, 2-2 సెమిస్టర్ల, M.Sc 1, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
News September 20, 2025
డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.