News March 24, 2025
ముంచంగిపుట్టు: బొలెరో బోల్తా.. మహిళ మృతి

ముంచంగిపుట్టు మండలంలోని బొలెరో బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పనసకాయలు లోడ్తో బయలుదేరిన బొలెరో మండలంలోని రంగబయలు పంచాయితీ మట్టిగుడ ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా స్థానికుల గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
SUPER.. టాప్ 5లో జగిత్యాల విద్యార్థినికి చోటు

బాసర, MBNR IIITల్లో JGTL జిల్లా నుంచి 66 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 1,690 సీట్లకు గాను జిల్లా నుంచి విద్యార్థిని వర్షిణి టాప్ 5లో ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అటెండ్ కానివారు తమకు కేటాయించిన సీట్లు కోల్పోయే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
News July 5, 2025
విజయవాడలో ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య..!

విజయవాడ అయోధ్య నగర్లోని క్షత్రియ భవన్లో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
News July 5, 2025
రాజమండ్రిలో ఈనెల 7న జాబ్ మేళా..!

ఈనెల 7న రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ మేళాలో రవళి స్పిన్నర్స్ కంపనీలో టెక్నికల్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. బి.టెక్, పాలిటెక్నిక్, ఐటీఐ పూర్తి చేసి, 19 – 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.