News June 23, 2024
ముండ్లమూరు: మనస్తాపంతో విద్యార్థి బలవన్మరణం

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరు మండలం శంకరాపురంలో శనివారం వెలుగు చూసింది. పరుశురాం కుమారుడు జమదగ్ని (19) ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల విడుదల చేసిన సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపానికి గురై ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో ఉరేసుకొని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేశారు.
Similar News
News September 14, 2025
24 గంటలు అందుబాటులో ఉంటా: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి, ప్రజలకు ప్రభుత్వ సేవలు దగ్గరికి చేరవేస్తానని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం బాధ్యతల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో తనవంతు కీలకపాత్ర పోషిస్తానన్నారు. అలాగే భూ సమస్యలు, రెవెన్యూపరమైన ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు నూతన కలెక్టర్ తెలిపారు.
News September 13, 2025
ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013 నాన్ క్యాడర్ IPSగా రాష్ట్ర పోలీసు శాఖలో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.
News September 13, 2025
ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013లో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.