News March 30, 2025
ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జనగామ కలెక్టర్

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు జనగామ జిల్లా కలెక్టర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసం శాంతి, సామరస్యం, ఐక్యతను కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రేమ, సహనంతో ఉండాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కఠినమైన నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగిస్తారని తెలిపారు.
Similar News
News November 10, 2025
ములుగు గజ గజ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

అకాల వర్షాలతో ఆగమైన ప్రజలకు చలి రూపంలో మరో విపత్తు ఎదురవుతోంది. రేపటి నుంచి పది రోజులపాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పగలు, రాత్రి సమయాల్లో 10-14 డిగ్రీలు పడిపోతుందని పేర్కొంది. ఈరోజు నుంచే ములుగు ఏజెన్సీలో చలి ప్రభావం మొదలైంది. ఉదయం బారేడు పొద్దెక్కినా ఎక్కిన చలి ప్రభావం తగ్గలేదు. గోదావరి పరివాహక అటవీ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
News November 10, 2025
ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలి: కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 11 నిర్వహించే సర్దార్ ఏ-150 ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉదయం 9:30 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. జిల్లాలోని విద్యార్థులు, యువత, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.


