News March 18, 2025

ముక్కలుగా నరికి మూట కట్టారు

image

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో మహిళను ముక్కలుగా నరికి మూట కట్టేసి పడేశారు. దారుణంగా శరీర భాగాలు కట్ చేసి పడి ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. దుప్పట్లో నడుము కింది భాగం, ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2025

HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

image

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.

News September 19, 2025

నెల్లూరు: ఏడుగురి మృతి.. ముగ్గురిపై కేసు

image

సంగం మండలం పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు చనిపోయిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఏ1గా టిప్పర్ డ్రైవర్, ఏ2గా టిప్పర్ యజమానిని, ఏ3గా బుజ్జినాయుడు పేర్లు నమోదు చేశారు. బుజ్జినాయుడిని ఇసుక వ్యాపారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇసుకను ఆత్మకూరు వైపు నుంచి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆత్మకూరు పరిధిలో ప్రస్తుతం ఏ ఇసుక రీచ్‌కు అనుమతులు లేకపోవడం గమనార్హం.

News September 19, 2025

తిరుపతి: రూ.15వేల సాయం.. నేడే లాస్ట్ ఛాన్స్

image

వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకొనే ప్రయత్నం చేస్తోంది. నూతన వాహన మిత్ర దరఖాస్తులకు నేడు చివరితేది కాగా 22వ తేదీన అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 42,098 ఆటోలు ఉండగా తిరుపతి RTA పరిధిలో 29,900, గూడూరు పరిధిలో 12,198 ఆటోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్క్రూట్నీ అనంతరం అర్హుల జాబితా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.