News December 28, 2025
‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.
Similar News
News February 21, 2026
AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
News February 21, 2026
చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మనమంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. రాజకీయ నాటకాలకు AI సమ్మిట్ను ఎంచుకోవడం సరికాదని BRS MLA కేటీఆర్ విమర్శించారు. INC కార్యకర్తలు CM రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారంటూ Xలో ఎద్దేవా చేశారు.


