News March 30, 2025

ముక్తేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి మహేశ్ తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

Similar News

News February 28, 2026

బంగారం ధరల ఎఫెక్ట్.. ₹4 లక్షల కోట్లకు లోన్స్!

image

బ్యాంకుల రిటైల్ రుణాల్లో గోల్డ్ లోన్స్ వాటా గతేడాదితో పోలిస్తే 3% నుంచి 6%కి పెరిగింది. జనవరి నాటికి గోల్డ్ లోన్స్ 128% వృద్ధి చెంది దాదాపు ₹4 లక్షల కోట్లకు చేరాయి. బంగారం ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రిటైల్ విభాగంలో క్రెడిట్ కార్డ్ లోన్స్ తగ్గగా వెహికల్ లోన్స్ 17% వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం డిపాజిట్లు ₹247.7 లక్షల కోట్లుగా ఉండగా లోన్లు ₹204.32 లక్షల కోట్లకు చేరాయి.

News February 28, 2026

కొన్నిసార్లు మిలిటరీ యాక్షన్ తప్పదు.. ఇరాన్‌పై ట్రంప్

image

ఇరాన్‌తో జరుగుతున్న చర్చల పట్ల ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించడం లేదంటూ పెదవి విరిచారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. అయితే వారు చిత్తశుద్ధితో చర్చలు జరపడం లేదని విమర్శించారు. తాము మిలిటరీని వాడొద్దనే అనుకుంటున్నామని, కానీ కొన్నిసార్లు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. సైనిక చర్య వల్ల మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలను కొట్టిపారేయలేమన్నారు.

News February 28, 2026

ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

image

ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫికేషన్‌ చేసే ప్రాసెస్‌ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలడమే దీనికి కారణం. మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్‌ను ఆపాలని నిర్ణయించారు. అయితే రేషన్ కోటాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.