News July 18, 2024
ముఖ్యమంత్రితో VC లో మాట్లాడిన బోధన్ యువ రైతు

రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బోధన్ మండలానికి చెందిన యువ రైతు రవి మాట్లాడారు. రూ. 2 లక్షల రుణమాఫీ అమలులోకి తెచ్చి రైతాంగానికి ఎనలేని భరోసా అందించారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుణమాఫీతో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు.
Similar News
News August 13, 2025
NZB: జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: CP

రానున్న 2-3 రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24X7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 (లేదా), పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59700కు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్కు సంప్రదించాలని సూచించారు.
News August 13, 2025
NZB: విజయవాడ ఇంద్రకీలాద్రిపై TPCC అధ్యక్షుడు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారినిTPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నిన్న రాత్రి మహేష్ కుమార్ గౌడ్ మోపిదేవిలోని సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కూడా దర్శించుకున్నారు.
News August 13, 2025
NZB: అవయవదానంతో మరణాన్ని జయించింది..!

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అంటారు పెద్దలు. కానీ అవయవదానం ద్వారా మరణించిన తరవాతా జీవించే అవకాశం లభిస్తుంది. NZB జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. NZB కోర్టులో టైపిస్టుగా పనిచేసిన అందె సుధారాణి (52) 2022 ప్రమాదవశాత్తు గాయపడి బ్రెయిన్ డెడ్ కాగా ఆమె కిడ్నీ, లివర్, లంగ్స్, కళ్లను కుటుంబ సభ్యులు జీవదాన్ ట్రస్టుకు అందజేశారు.