News February 23, 2025

ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు

image

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

Similar News

News November 19, 2025

నూజివీడు: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు సాధించిన ట్రిపుల్ ఐటీ బాలికలు

image

నూజివీడు పట్టణ పరిధిలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 66 మంది బాలికలు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగావకాశాలను సాధించినట్లు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ..ఆర్జీయూకేటీ – ఏపీటీతో కలసి నిర్వహించిన నియామక డ్రైవ్‌లో బాలికలు ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. వీరిలో 50 మంది సీఎస్ఈ, 9 మంది ఈసీఈ, ఏడుగురు ఈఈఈ విభాగాలకు చెందిన వారిగా తెలిపారు.

News November 19, 2025

బాలకృష్ణతో మరో సినిమా: అంబికా కృష్ణ

image

ఏలూరు: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తో ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మంగళవారం రాత్రి వైజాగ్‌లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను అంబికా కృష్ణ సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ..బాలయ్యతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రేక్షకులు మెచ్చే కథ లభ్యమైతే బాలకృష్ణతో మరో చిత్రం నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం కథల అన్వేషణలో ఉన్నామన్నారు.

News November 19, 2025

TMC విశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

టాటా మెమోరియల్ సెంటర్‌(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)‌లో 15 కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్‌బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in/